Thursday, February 18, 2010

తెలంగాణ - ప్రజాకాంక్ష

తెలంగాణాలోని సామాన్య ప్రజానీకం తెలంగాణాని కోరుకోవడం లేదని అది రాజకీయ నాయకుల నినాదమేనని కొందరు సమైక్యవాదులు అంటున్నారు. ఈ వాదం చాలా అసంబద్దమైనది. భారతదేశానికి స్వాతంత్ర్యం కొరకు జాతీయవాదులు పోరాటం చేస్తున్నప్పుడు కూడా మనం అనుకొనే సామాన్య జనం పెద్దగా ఉర్రూతలేమీ వూగలేదు. మధ్య తరగతి మేధావులు ( శిష్ట వర్గం ) నడిపిన ఉద్యమం అది.

ఇలాంటి ఉద్యమాలన్నీవిద్యనేర్చి సాంప్రదాయక శ్రామిక జీవితంలోంచి బయట పడ్డ శిష్ట వర్గాల నుండే మొదలౌతాయి. దీనికి ఉదాహరణగా మన దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న 95% మంది నాయకులను పేర్కొనవచ్చు. శిష్టవర్గాలకు మాత్రమే తాము, తమ ప్రాంతం ఎందువలన వెనుకబడి ఉన్నామో అర్ధమవుతుంది. ఇక రాజకీయాల విషయానికొస్తే ఏ చిన్నఉద్వేగం తమకు పనికొస్తుందన్నా వదులుకోరు. దానికి తెలంగాణా నాయకులు మాత్రమే కాకుండా సీమాంధ్ర మొదలుకొని భారత దేశంలోని ఏ నాయకులు కూడా అతీతులు కారు.

తెలంగాణా కొరకు పోరాడుతున్న వారిలో చదువుకొన్న శిష్ట వర్గాల కన్నా అనేక ప్రజాసంఘాలు, కవులు, కళాకారులు పోషిస్తున్న పాత్ర విశిష్టమైనది. దానిలో మనం నిజమైన, అట్టడుగు వర్గాల ప్రజాకాంక్షని ప్రత్యక్ష్యంగా చూడవచ్చు. కవులు, రచయితలు, కళాకారుల సృజనలే అయా సామాజాల అట్టడుగు వర్గాల పోరాటాల దిక్సూచి.

ఇంత కన్నా ప్రజాకాంక్షకి నిదర్శనం ఏమికావాలి?

2 comments:

  1. ప్రపంచంలో ఒక ప్రాంత లేదా జాతి ప్రజలు ఇంత బలంగా ఆత్మ గౌరవ, స్వపరిపాలన ఆకాంక్షను వ్యక్తపరిచిన సంధర్భం ఇంతవరకు లేకపోవచ్చు మరియు ఒక ఆకాంక్షకు కొన్ని రోజుల వ్యవధిలోనె ఒక మాదిరి వ్యతిరేక అకాంక్షను లేవనెత్తటం కూడా జరిగుండక పోవచ్చు.
    తెలంగాణ ప్రజలది న్యాయమైన ఆకాంక్ష అని చెప్పడానికి ఎలాంటి కమిటీలు, కమీషన్లు అవసరం లేదు. కాని ఒకే జాతి, ఒకే భాష అంటు దోపిడి నుండి, దురాక్రమణ స్థాయికి ఎదిగిన సీమాంధ్ర పెట్టుబడుదార్లు సామాన్య సీమాంధ్రులను, దేశాన్ని, ప్రపంచాన్ని మభ్యపెట్టడం కౄరమైన, ఆశ్చర్యకరమైన, ప్రమాదకరమైన విషయం. కాలయాపన జరిగితె తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల రూపం మారితె అమాయక సీమాంధ్రులు మూల్యం చెల్లించుకోవలసి వస్తుందేమో!

    ReplyDelete