Sunday, December 21, 2014

మిగులు సిద్ధాంతం


మనిషి కడుపు నింపుకోవడానికే అతని సమయం మొత్తం వినియోగమయిపోతే బాగుండిపోయేది. నాగరికత పెరిగి టెక్నాలజీ వచ్చి అతను భుక్తి కొరకు అతి కొద్ది సమయం మాత్రమే కష్టపడితే సరిపోయే స్థితి వచ్చింది. సరే పాపం బిడ్డడు సుఖపడిపోతే పోనీ. కానీ ఆ మిగిలిన సమయాన్ని అతను దేనికి ఉపయోగిస్తున్నాడు?

మిగులు సమయంలో ఊరకే తిని పండుకొంటే భూమికి చాలా మంచిది. అతను ఏదో పొడిచేద్దామని, ఇరగదీద్దామని బయలు దేరినాడంటే దేన్నో నాశనం చేయడానికేనన్నమాటే.

నిన్న లింగ సినిమా చూశాను. హీరో అంటాడు - తాను భూమిమీద పుట్టినందుకు గుర్తుగా ఏదైనా సాధించి మిగిల్చి పోవాలని. పుట్టి పోయిన వాళ్ళందరూ తమ ఆరడుగుల సమాధి నిర్మించి పోయినా ఇప్పటికి భూమి మీద జాగా మిగిలేది కాదు. ఇరగదీసి ప్యాలెస్‌లు  కట్టుకోవడానికి మనిషికి జాగా ఎక్కడిది? బువ్వెక్కణ్ణుంచొస్తది?


జిడ్డు కృష్ణమూర్తి శిష్యులకు చేసిన చివరి విన్నపం ఏమిటంటే తనపేరున ఎలాంటి స్మారకాల్ని నిర్మించొద్దని.  సద్గురు జగ్గీ వాసుదేవ్ అంటాడు.  ఏదో సాధిద్దామని బయలుదేరే వారే భూమికి భారమని.

అర్ధం ఏమిటంటే అతి తక్కువ వనరులను ఉపయోగిస్తూ జీవించడమే ఆదర్శనీయమని. ఆలోచనల్లో వ్యవస్థలో సాధించాల్సింది సాధిస్తే సరిపోతుంది.