Sunday, August 4, 2013

ఆంధ్రాలో ప్రజాస్వామిక చోటు లేకనే జనం హైదారాబాద్ కు వచ్చి పడుతున్నరు

ఆంధ్రా తో పోలిస్తే తెలంగాణాలో ప్రజాస్వామిక చోటు ఎక్కువ. అందుకనే అక్కడి పెత్తందారీ వర్గాలతో బాటు చోటు దొరకని వర్గాలు కూడా తెలంగాణాకు తరలాయి. అక్కడ కులం ఫ్యాక్టర్ ఎక్కువ. పెత్తందారీ కులాలవాళ్ళు మామూలు వాళ్ళకు చోటు దొరకనీయరు. అందరూ ఇక్కడకొచ్చి ఫ్రెష్ గాలి పీలుస్తారు. ఇప్పుడు అక్కడికెళ్ళాలంటే వచ్చిన పెద్ద  చిక్కుల్లో ఇది కూడా ఒకటి.

అభివృద్దిని, పెట్టుబడులను హైదరాబాద్ లోనే కేంద్రీకరించే కంటే ప్రాంతీయంగా వికేంద్రీకరించడమే మంచి అభివృద్ది నమూనా అవుతుంది. హైదరాబాద్ ఓ వెర్రి అయి కూర్చుంది. యెంత ట్రాఫిక్, యెంత కాలుష్యం, యెన్ని అసౌకర్యాలు ఉన్నా అదే మెల్టింగ్ పాట్ అయిపోయింది జనాలకి.  హైదారాబాద్ లో  జీవన నాణ్యత తక్కువ. తెలంగాణా యేర్పాటుతోనైనా హైదారాబాద్ మీద ఒత్తిడి తగ్గితే మంచిది.

ఆంధ్రాలో కొత్త రాజధాని యేర్పాటుచేసుకోవడం కూడా విజ్ణతతో జరగాలి. ముఖ్యంగా సారవంతమైన, నీటి పారుదల వసతి కలిగిన పంట భూముల్ని కొత్త రాజధాని కొరకు వాడ కూడదు. సమీప భవిష్యత్తులో  ప్రపంచం మృత్తిక కరువును కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఈ విషయంలో విజయవాడ గుంటూరుల కంటే ఒంగోలు జిల్లా మార్కాపురం లాంటి మిట్ట ప్రాంతాలైతేనే మంచిది.

1 comment:

  1. ఒంగోలు కొత్తరాజధానిగా బాగుంటుంది!చౌడుభూములలో ప్రభుత్వ కార్యాలయాలు సుందరంగా నిర్మించుకోవచ్చు!

    ReplyDelete